Mirzapur : గోలు 3.0 సిద్ధం

మీర్జాపూర్.. తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లను అలవాటు చేసిన సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించింది. 2018లో మొదటి సీజన్ వచ్చింది. రెండో సీజన్ 2020లో రెండో సీజన్ వచ్చింది. రెండు సీజన్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో వెబ్ సిరీస్ టీం మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో కు కూడా వినియోగదారులు పెరిగారు.

ఇదిలా ఉండగా, మీర్జాపూర్ సీజన్ 3పై అంచనాలు భారీగా పెరిగాయి. సీజన్ 3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతంది అని మీర్జాపూర్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల మీర్జాపూర్ సీజన్ 3 షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే క్లాప్ కొట్టిన ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫోటో వచ్చిన నాటి నుంచి మీర్జాపూర్ సిరీస్ అందిరి నోటా నానుతుంది.

తాజాగా మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సిరీస్ లో కీలక పాత్ర గోలు గుప్తా అని తెలిసిందే. ఈ పాత్రలో శ్వేతా త్రిపాఠి అనే నటి కనిపించింది. గోలు గుప్తా పాత్ర మీర్జాపూర్ రెండో సీజన్ లో చాలా కీలకంగా కనిపించింది. మూడో సీజన్ లో కూడా గోలు పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అంతా అనుకున్నారు. కాగా శ్వేతా త్రిపాఠి మీర్జాపూర్ 3 కోసం రెడీ అవుతున్నట్టు ఒక వీడియోను రిలీజ్ చేసింది.

- Advertisement -

ఈ వీడియోలో శ్వేతా త్రిపాఠి కఠినమైన వర్క్ అవుట్స్ చేస్తుంది. గోలు 3.0 రెడీ అవుతుంది అని, మీర్జాపూర్ యాక్షన్ కు రెడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో శ్వేతా త్రిపాఠి చేస్తున్న గోలు గుప్తా పాత్ర మీర్జాపూర్ సీజన్ లో కీలకమైందని అర్థమవుతుంది. ఈ సిరీస్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు