Yash Raj Films: “స్పై” ప్లానింగ్

యాష్ రాజ్ ఫిలిమ్స్.. బాలీవుడ్ లో మంచి పేరు ఉన్న ప్రొడక్షన్ హౌస్. 1970లో యాష్ రాజ్ చోప్రా స్థాపించిన ఈ ప్రొడక్షన్ కంపెనీ ని ప్రస్తుతం అతని తనయుడు ఆదిత్య చోప్రా అధినేతగా ఉన్నాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటి వరకు బాలీవుడ్ కు ఎన్నో గొప్ప సినిమాలను అందించింది. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బాలీవుడ్ లో భారీ ప్రొడక్షన్ హౌస్ లకు గట్టి పోటీనిస్తోంది.

ఇదిలా ఉండగా, సౌత్ ఇండస్ట్రీ లో ఒక సినిమాతో మరోక సినిమాను లింక్ పెట్టి వాటికి యూనివర్స్ అని ప్రత్యేక పేరును ఇస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో లోకేష్ కనకరాజు సినిమాలను లోకి యూనివర్స్, శైలేష్ కొలను.. హిట్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ.. సూపర్ హీరోస్, ప్రశాంత్ నీల్ మరో యూనివర్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా సౌత్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాటిక్ యూనివర్స్ లు వస్తున్నాయి.

ఈ సినిమాటిక్ యూనివర్స్ మానియా ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు పాకింది. ఈ యష్ రాజ్ ఫిల్స్ తాజాగా తాము కూడా సినిమాటిక్ యూనివర్స్ తెరకెక్కిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. స్పై యూనివర్స్ అంటూ ముందుకొచ్చింది. ఈ యూనివర్స్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ సినిమాలను తెరకెక్కించబోతున్నారు. అలాగే ఇప్పటి వచ్చిన కొన్ని సినిమాలను ఈ యూనివర్స్ లో యాడ్ చేస్తున్నారు.

- Advertisement -

2012లో వచ్చిన సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్, 2017లో వచ్చిన టైగర్ జిందా హై సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. అలాగే 2019లో టైగర్ ష్రాఫ్ మరియు హృతిక్ రోషన్ హీరోలుగా వార్ సినిమా వచ్చింది. ఇక ఈ ఏడాది షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా రాబోతోంది. ఈ సినిమాలన్నింటినీ స్పై యూనివర్స్ లో కలిపి మల్టీవర్స్ గా రెడీ చేస్తునట్టు ప్రకటన వచ్చింది. అంతే కాదు.. ఇకపై ఇంకా ఊహించని స్థాయిలో స్పై మల్టీవర్స్ సినిమాలు వస్తాయని కూడా వెల్లడించింది. మరి యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ స్పై యూనివర్స్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు