Vishwambhara : నాన్ స్టాప్ గా చిరు మూవీ మూవీ షూటింగ్.. ఎక్కడా ఆగట్లేదుగా!

Vishwambhara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ‘విశ్వంభర’ మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తునాడన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా యువి క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తుండగా, ఫైనల్ గా త్రిష అయితే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మూడు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతుంది. పంచ భూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మాత్రం ఆలస్యం కావడం వల్ల ఎప్పుడో మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ కాస్త గ్యాప్ ఇవ్వగా, సంక్రాంతి పండగ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లోనే ఈ సినిమా మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్లపైనే దృష్టి పెట్టడం జరిగింది. చిరంజీవి వచ్చీ రావడంతోనే రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పలు యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలని కూడా చిత్రీకరించడం జరిగింది.

నాలుగో షెడ్యూల్ సిటీలో..

చిరంజీవి నటిస్తున్న విశ్వంభర(Vishwambhara) రెండు షెడ్యూల్స్ షూటింగ్ నాన్ స్టాప్ గా మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన విషయం తెల్సిందే. అక్కడ ఓ పాట చిత్రీకరణతో పాటు బురదలో చిరుపై ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో చిరు డూప్ లేకుండా రియలిస్టిక్ గా కొన్ని స్టంట్స్ చేసాడట. ఇక ఆ తర్వాత మూడో షెడ్యూల్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్లాన్ చేయగా, విశ్వంభర మూడో షెడ్యూల్ కోసం ఊటీ లో జరిగింది. ఊటీలో జరిగిన మూడో షెడ్యూల్ లో చిరంజీవి మరియు త్రిష పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగగా, అక్కడ మరో యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారని సమాచారం. తాజాగా విశ్వంభర నాలుగో షెడ్యూల్ కూడా మొదలయింది. అది కూడఁస హైదరాబాద్ లోనే. హైదరాబాద్ శివారు ప్రాంతంలో రెగ్యులర్ గాసినిమాలు షూటింగ్ జరిగే ప్రాంతంలో లింగంపల్లి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఏప్రిల్ 19వరకు నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్ జరుగుతుందట.

కీలక పాత్రల్లో హీరోయిన్లు..

ఇక విశ్వంభర సినిమాలో మరో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుండి కన్ఫర్మేషన్ రావాలి. ఇక విశ్వంభర లో చిరంజీవి కి చెల్లెలు గా సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు రావు రమేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని సమాచారం. ఇక ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చంద్రబోస్ పాటల్ని రాస్తున్నారు. ఇక విశ్వంభర సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారన్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న సమయానికి కనీసం నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తయితేనే పండక్కి రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతి బరిలో అరడజను స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు