Vishwambhara : మెగా మూవీ ప్రయాణంలో నెక్స్ట్ ఎటు?

Vishwambhara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో విశ్వంభర మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తునాడన్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తుండగా, ఫైనల్ గా త్రిష అయితే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతుంది. పంచ భూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు ఎనిమిది నెలల క్రితమే అనౌన్స్ చేయగా, కార్యరూపం దాల్చడానికి చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మాత్రం ఆలస్యం కావడం వల్ల గ్యాప్ ఇవ్వగా, సంక్రాంతి పండగ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లోనే ఈ సినిమా మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్లపైనే దృష్టి పెట్టడం జరిగింది. చిరంజీవి వచ్చీ రావడంతోనే రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పలు యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలని చిత్రీకరించడం జరిగింది.

మూడో షెడ్యూల్ ముహూర్తం..

ఇక విశ్వంభర సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన విషయం తెల్సిందే. అక్కడ ఓ పాట చిత్రీకరణతో పాటు బురదలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో చిరు డూప్ లేకుండా రియలిస్టిక్ గా కొన్ని స్టంట్స్ చేసాడని సమాచారం. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌ సిటీలోని షెడ్యూల్‌ ను ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తదుపరి షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసారు. తాజాగా విశ్వంభర మూడో షెడ్యూల్ కోసం ఊటీకి షిఫ్ట్‌ అవ్వబోతున్నారు మేకర్స్. ఇప్పటికే దర్శకుడు ఇతర ప్రొడక్షన్ టీం ఊటీ చేరుకుని సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ ఊటీ లో జరగబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. వశిష్ఠ మల్లిడి ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలిసింది.

అక్కడ కూడా యాక్షన్ సీక్వెన్స్..

ఇక ఊటీలో జరగబోయే మూడో షెడ్యూల్ లో చిరంజీవి మరియు త్రిష పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతుందట. అలాగే ఊటీ లో మరో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ బర్త్ డే అయ్యాక ఆ షెడ్యూల్ లో పాల్గొంటాడని సమాచారం. ఇక విశ్వంభర సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత లు నటిస్తున్నారు. ఎంఎం. కీరవాణి ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే చంద్రబోస్ ఈ సినిమాకి పాటల్ని రాస్తున్నారు. ఇక విశ్వంభర సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారన్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న సమయానికి కనీసం నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తయితేనే పండక్కి రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు