Actress Saranya : ప్రముఖ నటి శరణ్య పై పోలీస్ కేసు నమోదు..

Actress Saranya : తమిళ్ తెలుగులో అమ్మ, అత్త పాత్రల్లో ఫేమస్ అయిన నటీమణుల్లో ప్రముఖ నటి శరణ్య పోన్వన్నన్ కూడా ఒకరు. వేదం, మనం, రఘువరన్ బిటెక్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా ఈమె పై చెన్నై లో పోలీస్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి శరణ్య పొన్వన్నన్ చేసిన పనికి ప్రస్తుతం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సౌత్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఈమె తమిళనాడులోని చెన్నైలోని విరుగంబాక్కంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా నటి శరణ్యకు, అలాగే ఆమె పొరుగింట్లో ఉంటున్న మరో మహిళ శ్రీదేవి కి పార్కింగ్ విషయంలో తరచూ గొడవ జరిగేది. దీంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో శరణ్య పొన్వన్నన్, సదరు మహిళ ఓ సందర్భంలో తీవ్ర వాగ్వాదానికి దిగారని తెలుస్తుంది.

కారు పార్కింగ్ వివాదం..

నటి శరణ్య తమ ఇంటి పక్కన నివాసం ఉంటున్న శ్రీదేవి అనే మహిళ ఇంటి గేటుకి అడ్డంగా నటి శరణ్య యొక్క కారుని పెట్టడంతో ఈ గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో సదరు మహిళతో తీవ్రంగా దూషించడమే గాక, అంతటితో ఆగకుండా శరణ్య పొన్వన్నన్ చంపుతానంటూ కూడా ఆమెను బెదిరించారంట. దీంతో బాధిత మహిళ స్థానిక చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఇక గతంలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పార్కింగ్ అనే సినిమాలో కూడా అచ్చం ఇలాగే పార్కింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలని చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాని ప్రస్తావిస్తూ, నటి శరణ్య పోలీస్ కేసు పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ నడుస్తుంది.

ఇక నటి శరణ్య విషయానికి వస్తే..

టాలీవుడ్ లో అమ్మ పాత్రలంటే ముందుగా గుర్తొచ్చేది సుధ, జయసుధ, రోహిణి లాంటి నటీమణులు. అలాగే తమిళ్ లో అమ్మ, అత్త పాత్రలకు ఫేమస్ అయిన ఆర్టిస్ట్ లలో నటి శరణ్య పోన్వన్నన్ (Actress Saranya) ఒకరు. అలాగే వేదం, మనం, గ్యాంగ్ లీడర్, మహా సముద్రం, రీసెంట్ గా ఖుషి వంటి తెలుగు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. అయితే కోలీవుడ్ లో మణిరత్నం నాయగన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈమె పలు తమిళ్, మలయాళ చిత్రాల్లో 80స్ లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈమె హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా సక్సెస్ అయింది. శరణ్య పొన్వన్నన్.. రఘువరన్ బీటెక్, వేదం వంటి సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచి తనకంటూ మంచి పేరును తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు తమిళ్, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఈక్రమంలో తాజా ఘటనతో ఆమె వివాదంలో ఇరుక్కుని సోషల్ మీడియా లో వైరల్ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు