Vishnu Manchu: సైడ్ అయిపోయాడు

ఈ దసరా సీజన్ లో నాలుగు సినిమాలు పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 5 న బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ ఉండేట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొనిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. మరోవైపు టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం “ది ఘోస్ట్”. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 5 న రిలీజ్ కానుంది.

ఈ రెండు చిత్రాలే పోటీ పడుతున్నయి అనుకుంటే.. ఈ రెండు చిత్రాలతో మరో రెండు చిత్రాలు పోటీ పడుతుండడం విశేషం. అవేంటంటే.. మంచు విష్ణు నటించిన “జిన్నా”. బెల్లంకొండ సాయి గణేష్ నటించిన ” స్వాతిముత్యం”. అక్టోబర్ 5వ తేదీన చిరంజీవి, నాగార్జునకిి పోటీగా మంచు విష్ణు తలపడబోతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో మంచు విష్ణు వెనక్కి తగ్గాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జిన్నా సినిమాని వెనక్కిపంపించారని, అక్టోబర్ 21న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచు విష్ణు సినిమాని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు