Boxoffice: విరుపాక్షుడి పరుగు.. ఇప్పట్లో ఆగేలా లేదు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతుంది. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తెలుగులో విడుదలై రెండు వారాలైనా పరుగు ఆపట్లేదు. విరూపాక్ష తర్వాత వచ్చిన వేరే సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమా అడ్డే లేకుండా పోయింది. ఇప్ప్పటి వరకు విడుదలైన రెండు వారాల్లో విరూపాక్ష 42 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా 80 గ్రాస్ దాటేసింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇప్పటికే హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచిన ఈ సినిమా కలెక్షన్లు ఇంకా సాధిస్తూనే ఉంది.

తాజాగా విరూపాక్ష ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఈరోజు అనగా మే 5న తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా పాసిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 400 థియేటర్లలో విడుదలయింది. ఇప్పడు ఈ సినిమా ఇతర భాషల కలెక్షన్ల తో కలిపి ఈజీగా 100 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక విరుపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటించగా, శ్రీ వెంకటేశ్వర సీనిచిత్ర బ్యానర్ లో బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ దండు విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేయగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. ఇక తెలుగులో మే5 న రామబాణం, ఉగ్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల ఫలితంపై విరూపాక్ష లాంగ్ రన్ ఆధారపడి ఉంది. ఫైనల్ గా విరుపాక్షుడి పరుగు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు