Sai Dharam Tej: విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా లెక్కల మాష్టారు

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. నూతన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత బీ.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. సంయుక్త మీనన్ విరూపాక్షలో హీరోయిన్ గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సాయి చంద్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచన సహకారం అందించాడు. కాంతారా ఫేమ్ ‘అజనీష్ లోకనాథ్’ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక తాజాగా విరూపాక్ష మూవీ టీమ్ తమ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఇలాంటి సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడమేంటని చిత్ర విశ్లేషకులు ఆశ్యర్య పోతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు అనగా ఏప్రిల్ 16 న ఏలూరు లోని సి.ఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధి గా విచ్చేయనున్నాడు. ఇక విరూపాక్ష సినిమా ను ఏప్రిల్ 21 న పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు