Venu Swamy : ఈ కాంట్రవర్సీ ఫేమస్ పంతులుని గుర్తు పట్టారా?

Venu swamy

టాలీవుడ్ లో ఈ మధ్య పూజలు, ప్రైవేట్ హోమాలు మరీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో తరచూ సెలెబ్రిటీల పూజలు ఎక్కువయ్యాయి. అయితే ఈ పూజల వల్ల చాలా మంది పంతుళ్లు కూడా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా పంతుళ్లు కూడా. అలాంటి వారిలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా ఒకరు. ఈ మధ్య ఈయన మరీ ఫేమస్ అవుతున్నాడు. అయ్యేలా చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే ఈయన కెరీర్ లో కాంట్రవర్సీ లకే చోటు ఎక్కువ. ముఖ్యంగా ఏ సెలబ్రిటీ న్యూస్ వైరల్ అయినా దానిపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు.

ఇక ఎవరైనా స్టార్ సినిమా రిలీజ్ అవుతున్నా ఆ సినిమాలు రిలీజ్ కాకముందే ఆ హీరో జాతకం చెప్పేస్తాడు. అప్పుడప్పుడు అవి బెడిసిగొట్టి ట్రోలింగ్ కి కూడా గురవుతాడు. ఇదిలా ఉండగా వేణు స్వామి సెలెబ్రిటీలతో అప్పుడప్పుడూ బాగానే పూజలు చేయిస్తూ ఉంటాడు, నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటి హీరోయిన్లు ఈయన ఆధ్వర్యంలో తరచూ పూజలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ పెద్దగా మేల్ సెలెబ్రిటీల దగ్గర అయితే కనిపించలేదు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా వేణు స్వామి సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వైరల్ కాలేదు కానీ, నెటిజన్లు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.ఒక ఓల్డ్ ఫోటో పెట్టి ఈ హీరోయిన్స్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా? గెస్ చేయండి అంటూ పోస్ట్లు పెడుతున్నారు. అయితే ఆ పోస్ట్ లో ఉన్నది టీనేజ్ లో ఉన్న వేణు స్వామి అని తెలిసింది. ఇక ఆ ఫోటో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు ప్రారంభోత్సవం రోజు తీసిన స్టిల్ కాగా, ఆ స్టిల్ లో హీరోయిన్లు నగ్మా, రమ్య కృష్ణ మధ్యలో నిల్చొని అమాయకంగా నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లయితే అప్పుడూ హీరోయిన్లతోనే ఇప్పుడు కూడా హీరోయిన్లతోనే కాలక్షేపం అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు