Tollywood : ఆ హీరోకు తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్

లేడి విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారిపోయారు వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం దేశ సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకెళ్తోంది. క్రాక్ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ లో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల యశోదలో మధుబాలగా, వీరసింహారెడ్డిలో కూడా నటించి మరొకసారి తన నటన నిరూపించుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం తాను ఓ సినిమాలో స్టార్ హీరోకు తల్లిగా నటించడానికి సిద్ధమైందని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. అయితే ఈ సినిమాలో ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తల్లిగా నటించమని డైరెక్టర్ సంప్రదించారట. సినిమా స్టోరీ బాగుండటంతో వెంటనే వరలక్ష్మి కూడా ఈ పాత్రకు ఒప్పుకుందట. కానీ ఆమె అభిమానులు ఇంతకాలం పవర్ఫుల్ లేడీ విలన్ గా చేసి ఇప్పుడు తల్లి పాత్రలు చేయడం బాగోదని అంటున్నారు

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు