Bollywood: స్టార్ సింగర్ తో తెలుగులో మాట్లాడించిన నవీన్ పొలిశెట్టి

శ్రేయా ఘోషాల్. ఇండియన్ సంగీత ప్రపంచంలో ఇప్పుడు మార్మోగుహతున్నపేరు. మెలోడీ ఫిమేల్ సింగర్ గా చాలా మందికి ఈమె ఫేవరేట్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో స్టార్ సింగర్ గా తన హవా కొనసాగిస్తోంది. తెలుగులో ఒక్కడు సినిమాలో “నువ్వేం మాయ చేసావో” గాని పాటతో ఫేమస్ అయిన శ్రేయా ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో చాలా పాటలు పాడింది. రీసెంట్ గా రాధేశ్యామ్ లో నిన్నెలే నిన్నేలే సాంగ్ తో మరోసారి మెప్పించింది.

అయితే తెలుగులో వందల పాటలు పాడినా శ్రేయా ఘోషాల్ కి అస్సలు తెలుగురాదు. తెలుగు మాటలు అర్థమైనా మాట్లాడడం రాదు. అలాంటిది టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ఒక ఈవెంట్ లో శ్రేయా ఘోషాల్ తో తెలుగులో మాట్లాడించాడు. హైద్రాబాద్ లో రెడ్ fm వారు నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ లో పాడడానికి శ్రేయా ఘోషాల్ వచ్చింది. అక్కడికి తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నవీన్ పొలిశెట్టి వచ్చాడు.

అక్కడ శ్రేయా ఘోషాల్ తాను పాడిన ఎన్నోపాటలని గుర్తు చేస్తూ ఈ ఈవెంట్ సాగింది. ఈ ఈవెంట్ ముగుస్తుండగా నవీన్ పొలిశెట్టి శ్రేయా ఘోషల్ తో రెండు మాటలు మాట్లాడించాడు. “అందంలో మెరుపు లేదు, హైదరాబాద్ కు తిరుగులేదు” అని తనదైన స్టైల్ లో శ్రేయా ఘోషాల్ చెప్పింది. ఈ వీడియో ని నవీన్ పోలిశెట్టి తన ట్విట్టర్ పేజీ లో షేర్ చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు