Siva Karthikeyan: కోలీవుడ్లో ఎలాంటి పాత్రలోనైనా సరే నటించి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు హీరో శివ కార్తికేయన్… తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ.. ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నారు.. శివ కార్తికేయన్ ఎప్పుడూ కూడా దర్శకుల నిర్మాతల గురించి ఆలోచిస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కొన్నిసార్లు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా శివ కార్తికేయన్ రూ.50 లక్షలు సినీ ఇండస్ట్రీకి విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.. వాటి గురించి చూద్దాం.
విరాళం ఇచ్చిన శివ కార్తికేయన్ ..
సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు శివ కార్తికేయన్.. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఒక ట్వీట్ రూపంలో లేఖ వైరల్ గా మారుతోంది. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నటుడు విశాల్ కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా భవన నిర్మాణం కోసం చాలా తాపత్రయ పడుతూ ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు విరాళాలు కూడా సేకరించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది విశాల్.
పిలుపు మేరకు..
నటుడు విశాల్ పిలుపుతో హీరో కమలహాసన్, సూర్య, విజయ్ , కార్తీ వంటి స్టార్ హీరోలు కూడా తమ వంతు సహాయంగా కూడా అందించారు.. ఇప్పుడు తాజాగా నటుడు శివ కార్తికేయన్ కూడా రూ.50 లక్షలు విరాళం ఇవ్వడంతో అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దాదాపుగా రూ .40 కోట్ల మొత్తం తో ఈ భవనాన్ని పూర్తి చేశారట.. మరో 25 కోట్ల రూపాయలు అవసరం ఉండడంతో నటీనటుల సంఘం నుంచి బ్యాంకు రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
శివ కార్తికేయన్ కు ధన్యవాదాలు..
అయితే ఈ రుణం కావాలి అంటే బ్యాంకులో 12 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే రూ. 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదట.. అందుకు సరిపడి మొత్తాన్ని కూడా హీరో విశాల్ ఇలా విరాళం రూపంలో పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నటుడు నాజర్ ఉన్నారు.. అలాగే ట్రెజరీ విభాగంలో హీరో కార్తీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఇచ్చినటువంటి ఈ విరాళంతో వారికి కాస్త ఊపిరి వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోని శివ కార్తికేయన్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ రూపంలో షేర్ చేయగా ఇది కాస్తా వైరల్ గా మారుతోంది.
శివ కార్తికేయన్ సినిమాలు..
ఇటీవలే అయలాన్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈసారి రిలీజ్ చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని అంతే రేంజ్ లో సక్సెస్ కావాలని ఆయన ఆశిస్తున్నారు.
Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building.
He handed the cheque to South Indian Artistes’ Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t— Ramesh Bala (@rameshlaus) April 23, 2024