అందాల తార శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు ఆమె 20 సంవత్సరాలుగా తనదైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. శ్రియ ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతీ మూమెంట్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడూ తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటోంది.
శ్రియ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ వన్నె తరగని అందంతో నేటితరం నాయికలకు గట్టి పోటీనే ఇస్తోంది. సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్లో ఉంటూ మంట పుట్టించే రొమాంటిక్ అప్డేట్స్ ని షేర్ చేస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటోంది శ్రియ.
ఇటీవలే కుటుంబంతో కలిసి విహార యాత్ర కోసం మాల్దీవులు వెళ్లింది. అక్కడ సేద తీరింది. శ్రియ బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా బికినీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులను కవ్వించిందనే చెప్పాలి. షేర్ చేసిన ఫోటోల్లో మల్టీకలర్ బికినీలో కనిపించింది శ్రియ. తెలుగులో ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ అనే సినిమాలో నటిస్తోంది.