G2: గూఢచారి సీక్వెల్ తర్వాత ఆ జోనర్ లో సినిమా చేస్తానన్న శేష్

టాలీవుడ్ లో విభిన్న శైలిలో సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతున్న టాలెంటెడ్ హీరో అడవి శేష్. స్వీయ దర్శకత్వంలో వచ్చిన కర్మ సినిమాతో హీరోగా మారిన అడవిశేష్ ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో సైడ్ రోల్స్ చేస్తూ నెమ్మదిగా క్లిక్ అయ్యాడు. ఇక తానే కథ స్క్రీన్ ప్లే అందించిన “క్షణం” సినిమాతో తొలి బ్రేక్ ని అందుకున్న అడవి శేష్ ఆ తర్వాత కూడా రొటీన్ కి భిన్నంగా మంచి సినిమాలు చేసాడు. గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో స్పై థ్రిలర్స్ కి కేరాఫ్ గా మారిపోయాడు.

ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రాలు కూడా ఈ జోనర్లోనే వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అడవి శేష్ తన రాబోయే సినిమా గురించి అప్డేట్ తన ట్విట్టర్లో షేర్ చేసాడు. అడవి శేష్ ఇప్పుడు చేస్తున్న సినిమాల తర్వాత తాను ఒక ప్రేమ కథా చిత్రం లో నటిస్తున్నానని ఆ ట్వీట్ ద్వారా చెప్పాడు. ఆ సినిమా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మరికొన్ని నెలల్లో ఉండబోతుందని అన్నాడు. ప్రస్తుతం గూఢచారి 2 చిత్రంలో నటిస్తున్న అడవిశేష్ ఆ తర్వాత మరో థ్రిల్లర్ జోనర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాతే అడవిశేష్ ఆ లవ్ స్టోరీని చేస్తాడని చెప్పవచ్చు. అందుకే రోజుల్లో అని కాకుండా నెలల్లో అని చెప్పాడు.

అయితే అడవిశేష్ చేయబోయే ఆ ప్రేమ కథా చిత్రానికి డైరెక్టర్ గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ఆ సినిమాను అడవిశేషే దర్శకత్వం వహిస్తాడా? లేక క్షణం, గూఢచారి సినిమాలకు చేసినట్టు తనే కథ, స్క్రీన్ ప్లే అందించి వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటాడా అనేది? తెలియదు. ఏది ఏమైనా ఇలా డిఫరెంట్ జోనర్ లో వరుస సినిమాలు చేస్తున్న అడవి శేష్ టైర్2 హీరోల్లో నెంబర్ వన్ స్థానానికి మరింత దగ్గరవుతున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు