Harish Shanker:పవర్ స్టార్ తోనే తమ ప్రయాణం అంటున్న మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ మీదున్న తన సినిమాలన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక సినిమా 90 శాతం పూర్తిచేయగా, మిగతా మూడు సినిమాలను కూడా వెంటవెంటనే పూర్తి చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నవారందరికీ ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ అయిన జనసేన ప్రచార పనుల్లో ఉన్నాడు.

ఇప్పటికే వైజాగ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ శత చండి హోమం జరిపించాడు. త్వరలో వారాహి యాత్ర తో జనసేన ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. దీనికై అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. అయితే దీని వల్ల పవన్ తో తీస్తున్న మేకర్స్ తమ సినిమాల షూటింగ్లు ఇంకా పూర్తికానందువల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయం పై పవన్ కళ్యాణ్ చిత్ర నిర్మాతలు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ నిన్న చేసిన చండీ యాగానికి హాజరైన ఆ చిత్ర నిర్మాతలు అక్కడ తాము తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ త్వరలో ఎన్నికలున్నందున పవన్ కళ్యాణ్ జనసేన వారాహి యాత్రలో పాల్గొనబోతున్నారు, కాబట్టి తమ షూటింగ్ లు ఆగిపోకూడదు, అలాగే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తమ సినిమాల షూటింగ్ లన్ని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్న మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే తమ షూటింగ్ లు కూడా జరుపుతామని హరీష్ శంకర్ తో పాటు చిత్ర నిర్మాతలు తెలిపారు. కేవలం ఇదే కాదు తెలుగు సినిమాల షూటింగ్ లు హైదరాబాద్ లోనే కాక వైజాగ్ లో కూడా జరపాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ సినిమాలు పెండింగ్ లో పెడతారని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఆ అనుమానం తొలగి సంతోషాన్నిచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు