Tollywood: తిరుపతి లో సందడి చేసిన మలయాళీ ముద్దుగుమ్మ

తెలుగు యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస సినిమాల్తో దూసుకుపోతుంది. మలయాళం నుంచి వచ్చినా తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఈ హీరోయిన్ భీమ్లా నాయక్, బింబిసార తో పాటు లేటెస్ట్ గా వచ్చిన సార్ మూవీలతో మంచి హిట్లు కొట్టింది. ఇలా టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు మెగా హీరో ‘సాయి ధరమ్ తేజ్’ తో విరూపాక్ష అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్ప్పటికే ఊపందుకున్నాయి.

తాజాగా సంయుక్త మీనన్ తిరుపతి లో సందడి చేసింది. ముందుగా తిరుమల వెంకటేశ్వరా స్వామి ని దర్శించుకున్న సంయుక్త అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ తిరుపతికి రావడం చాలా ఆనందంగా ఉందని, ఏటా ఇక్కడికి వస్తూ ఉంటానని, ఇక త్వరలో విడుదలవుతున్న తాను నటించిన విరూపాక్ష చిత్రాన్ని ఆదరించాలని చెప్పింది. దర్శనం అయిన అనంతరం సంయుక్త మీనన్ “భీమా జ్యూవెల్లెర్స్” అనే గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్ళింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ జరుపుకుంటున్న నాల్గవ బ్రాంచ్ అని ఆ సంస్థ యజమాని చెప్పడం జరిగింది.

ఇక సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా విడుదల అవుతుంది. ఈ మూవీ హిట్ అయితే సంయుక్త మీనన్ మరిన్ని ఆఫర్స్ దక్కించుకోవడం ఖాయం గా అనిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు