Samantha: చికిత్స కోసం సౌత్ కొరియాకు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఉండరు. ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సమంత, ప్రస్తుతం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. యశోద సినిమా విడుదల ముందే తనకు మయోసైటీస్ అనే వ్యాధి వచ్చిందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఈమె బయట ఎక్కువగా కనిపించలేదు. యశోద ప్రమోషన్లలో కూడా సమంత కనిపించలేదు. కేవలం ఒక ఇంటర్వ్యూతోనే సరిపెట్టింది.

అయితే సమంతకు మైయోసైటీస్ అనే వ్యాధి ఉందని తెలిసిన నాటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనేక పుకార్లు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సమంత ఆరోగ్యం మరింత క్షిణించిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. సమంత ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని తెలిపారు. తాజాగా సమంత గురించి మరో వార్త వైరల్ అవుతోంది.

సమంత మయోసైటీస్ చికిత్స కోసం సౌత్ కొరియాకు వెళ్లిందట. అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి మయోసైటీస్ కు చికిత్స తీసుకుంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. చికిత్స తర్వాత సౌత్ కొరియా నుంచి వచ్చి విజయ్ దేవరకొండతో ఖుషి చిత్ర షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. సమంత అనారోగ్య పరిస్థితుల వల్లే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి చిత్రం షూటింగ్ నిలిచిపోయిందన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు