Sukumar :విరూపాక్ష 2 ఉంటుందా ?

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా విరూపాక్ష గత వారం రిలీజ్ అయింది. మిస్టరీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బివియస్ఎన్ ప్రసాద్ సినిమాని నిర్మించారు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త , హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకే వచ్చాయి. ప్రస్తుతం సెలెబ్రెటీల నుండి నార్మల్ ఆడియన్స్ వరకు అందరు విరూపాక్ష సినిమా గురించే మాట్లాడుతున్నారు.

అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ లో డైరెక్టర్ కార్తీక్ దండు కథకి సంబంధించి కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వకుండా వదిలేసారు. ప్రేక్షకులు సినిమా మొత్తం ఎంజాయ్ చేసిన కూడా వాళ్ళ డౌట్ లు మాత్రం అలాగే ఉండిపోయాయి. సినిమా చూసిన అందరు ట్విట్టర్ వేదికగా విరూపాక్షకి సంబంధించి వాళ్ళ వాళ్ళ అనుమానాల్నిపోస్ట్ చేస్తుండటంతో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి డైరెక్టర్ కార్తీక్ దండు ఇటీవలే ఒక ఇంటర్వ్ లో పాల్గొని విరూపాక్ష సినిమాకి పార్ట్ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -

అందుకే సినిమాలో కొన్ని విషయాలని అలాగే వదిలేశాం అని ఆయన చెప్పుకొచ్చారు. అసలు కథ పార్ట్ 2 లోనే ఉంటుందని పార్ట్ 1లో ఉన్న ప్రతి క్యారెక్టర్ , ప్రతి ఎలిమెంట్ పార్ట్ 2 లో కూడా కంటిన్యూ అవుతుంది అని ఆయన అన్నాడు.వచ్చే నెల మొదటి వారంలో విరూపాక్ష సినిమా పాన్ ఇండియా గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లిట్ రన్ తరువాత సినిమా నెక్స్ట్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతాం అని అన్నారు.ప్రస్తుతం తెలుగు మరియు అన్ని భాషల్లో పార్ట్ 2 ట్రెండ్స్ నడుస్తుండటం మేకర్స్ ఈ డెషిషన్ తీసుకున్నారని టాక్.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు