Ritika Singh: ట్రోలర్స్ పై ఘాటు వ్యాఖ్యలు

రితికా సింగ్.. గురు సినిమాతో బాక్సర్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో కుర్రకారను కట్టిపడేస్తుంది ఈ సుందరి. హిందీలో సాలా కద్దూస్, తమిళంలో ఇరుదు సుట్రు అనే చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసింది ఈ చిన్నది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేయగా అందులో వెంకటేష్ తో రితిక కలిసి నటించింది. ఈ చిత్రంతో నటిగా ఈమెకి మంచి పేరు రావడంతో అవకాశాలు కూడా వచ్చి పడ్డాయి.

లారెన్స్ సరసన శివలింగ, నీవెవరో వంటి సినిమాలలో నటించింది. తమిళంలో మరియు తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ కి తెలుగులో అయితే ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. నిజానికి ఈమె మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్. అంతేకాదు ఈ హీరోయిన్ ఇండియా తరఫున 2009లో ప్రతినిత్యం కూడా వహించిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు.

ప్రస్తుతం రితిక నటించిన ” ఇన్ కార్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రితిక.. కొందరు ట్రోలర్స్, మీమర్స్ పైన తీవ్రస్థాయిలో మండిపడింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” అందరికీ కుటుంబం ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వ్యక్తులకు కూడా. కానీ వాళ్లు వాటిని పట్టించుకోరు. మీమ్స్, ట్రోల్స్ నన్ను ఎంతో బాధించాయి. అవి చూసి నా మనసు చాలా బాధపడింది. దయచేసి ఇతరులకు గౌరవం ఇవ్వండి. ముఖ్యంగా మహిళలకు. సెలబ్రిటీ అయినా మధ్య తరగతి అమ్మాయి అయినా ఒకేలా చూడాలి. మిడిల్ క్లాస్ అమ్మాయిని ఏమైనా చేయొచ్చు, ఎవరు అడగరు అని చాలామంది భావిస్తుంటారు. వారిని తీసుకువెళ్లి ఏమైనా చేయొచ్చు అని ఆలోచనలో ఉంటారు. ఈ ఆలోచన తప్పు. ఇందులో మార్పు రావాలి” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు