Rishab Shetty: స్టార్ హీరోని కలిసిన రిషబ్ శెట్టి.. కాంతార-2 కోసమేనా..?

Rishab Shetty..కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం కాంతార. ఈ సినిమాతో ఓవర్ నైట్ కి అటు డైరెక్టర్ గా.. ఇటు హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో రిషబ్ శెట్టి. 2022లో విడుదలైన ఈ సినిమా ప్రతిచోట కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తరువాత చిత్ర బృందం ఈ సినిమా ప్రీక్వెల్ గా కాంతార-2 వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల పోస్టర్స్, గ్లింప్స్ సైతం విడుదల చేయగా అభిమానులకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి.

Rishab Shetty :Rishab Shetty met star hero.. for Kantara-2..?
Rishab Shetty :Rishab Shetty met star hero.. for Kantara-2..?

కాంతారా -2 అక్కడి నుంచే మొదలు..

గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ స్టార్ హీరో ఎవరనే విషయం మాత్రం ఇప్పటివరకు చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.. ప్రస్తుతం కాంతార-2 చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే చాలా వేగంగానే జరుగుతున్నాయి. కాంతార సినిమా మొదటి భాగం స్టోరీ ఎక్కడైతే మొదలయ్యిందో దానికి ముందు జరిగిన సంఘటనలతోనే కాంతార -2 తెరకెక్కించబోతున్నారు.

కాంతారా -2 లో మోహన్ లాల్:

ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఆయన భార్య ప్రగతితో కలిసి మళయాలంలో స్టార్ హీరోగా పేరు పొందిన మోహన్ లాల్ ని కలవడం జరిగింది. ఈ విషయాన్ని హీరో స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా లెజెండరీ నటుడుని కలవడం చాలా గౌరవంగా ఉందంటూ వెల్లడించారు. అలా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో.. కాంతార-2 కోసమే రిషబ్ శెట్టి మోహన్ లాల్ ని కలిసి ఉంటారు అంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా మరింత బాగుంటుందని పాన్ ఇండియా లెవెల్ లో మరింత సక్సెస్ అవుతుందని కూడా అభిమానులు వాపోతున్నారు. మోహన్ లాల్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటారు.. మరి అభిమానులు అనుకున్నట్టుగానే.. ఇందులో మోహన్ లాల్ ఏమైనా నటిస్తారేమో చూడాలి.

- Advertisement -

గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్న రిషబ్ శెట్టి..

కాంతార-2 కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ ని కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

రిషబ్ శెట్టి సినిమాలు..

మొదట రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా రక్షిత్ శెట్టి హీరోగా కిరిక్ పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల తమ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఎవరికివారు తమ సినిమా కెరియర్లో బిజీ అయిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Rishab Shetty (@rishabshettyofficial)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు