RC 17.. రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా రంగస్థలం… ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా వసూలు చేసింది.. అందుకే ఈ కాంబో కోసం అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురు చూస్తారనటంలో సందేహం లేదు. అయితే తాజాగా అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రావడానికి ముస్తాబుతోంది… ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేస్తూనే.. మరోవైపు రెండు సినిమాలను ప్రకటించారు.. అందులో ఒకటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో.. మరొకటి సుకుమార్ దర్శకత్వంలో.. కుదిరితే ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది ఆఖరి లోపు పూర్తి చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు.. ఇక అందుకు తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా ప్లాన్ కూడా చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాతో మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే రామ్ చరణ్, సుకుమార్ తో భారీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సుకుమార్ పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేసి.. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.. ఇది స్వతంత్ర సమయంలో జరిగిన రజాకార్ పోరాట నేపథ్యంలో తెరకెక్కబోతుందని తెలుస్తోంది.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట.. ఒకవేళ ఇదే నిజమైతే రజాకార్ నేపథ్యంలో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా వస్తే.. అంతకంటే సంచలనం ఇంకోటి లేదు అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే ఈమధ్య రజాకార్ నేపథ్యంలో ఒక సినిమా రాగా దానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
రామ్ చరణ్ సినిమాలు.
2019లో వినయ విధేయ రామ సినిమా విడుదలయితే రాజమౌళి చేతిలో పడి దాదాపు నాలుగు సంవత్సరాలు ఒకే సినిమాకు కేటాయించారు.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.. రాంచరణ్ అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి రావడంతో మళ్లీ మూడేళ్లుగా కనపడలేదు.. ఇకపై ఈ గ్యాప్ అనేది అసలు ఉండకూడదని.. అందుకే వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు.. ఇక బుచ్చిబాబు సినిమాను జూన్ నుంచి మొదలుపెట్టి త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.. అలాగే శంకర్ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.. మరో 10 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవగా .. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ వేగంగా చేసి అక్టోబర్ 30న సినిమాను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాకు దిల్ రాజు ఏకంగా రూ .300 కోట్లు ఖర్చుపెట్టగా పొలిటికల్ ఎంటర్టైనర్ గా రాబోతోంది.. ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని శంకర్ చెబుతున్నారు.. మరోవైపు బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిపారు.. మరి మూడు సినిమాలు మూడు వివిధ జోనర్లలో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలు రామ్ చరణ్ ను ఏ రేంజ్కి తీసుకెళ్తాయో చూడాలి.