BSS11 : హారర్ మిస్టరీ డ్రామాగా కొండన్న కొత్త సినిమా!

BSS11 : టాలీవుడ్ లో నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. పదేళ్ల కింద అప్పటి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతో యావరేజ్ సినిమాని అందుకున్నా, హీరోగా నిలదొక్కుకోగలడు అని చాలా మందికి నమ్మకమొచ్చింది. కానీ ఆ నమ్మకం ఇప్పటివరకు నిజమవలేదు. రొటీన్ యాక్టింగ్ చేస్తాడని విమర్శలు ఉన్న ఈ హీరో కష్టపడి ఏ సినిమా చేసినా అది ప్లాప్ అవుతుంది. మధ్యలో రాక్షసుడు అని రీమేక్ మూవీ తో వచ్చి ఓ మోస్తరు సక్సెస్ అందుకున్నాడు. కానీ దాంతో బెల్లంకొండకి ఒరిగిందేమి లేదు. ఇక లాస్ట్ ఇయర్ ఛత్రపతి హిందీ రీమేక్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బెల్లంకొండ పై వచ్చిన ట్రోల్స్ మామూలు కావు. ఏది ఏమైనా ఇప్పుడు బెల్లంకొండ కి ఓ నిఖార్సైన హిట్టు కావాలి. దానికోసమే కాస్త అలోచించి సేఫ్ లో ఉండాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ వారసుడు. ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ హీరో.

మిస్టరీ డ్రామాతో వస్తున్నాడు?

తాజాగా బెల్లం కొండా సాయి శ్రీనివాస్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా #BSS11 చిత్రాన్ని ప్ర‌క‌టించారు. లోతైన భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరు గాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కౌశిక్ ఈ సినిమాకి క‌థా ర‌చ‌యిత‌. తాజాగా శ్రీరామ‌ న‌వ‌మి సంద‌ర్భంగా పోస్టర్ లాంచ్‌ చేయగా, ఆ పోస్టర్ తోనే చాలా డెప్త్ ఉన్న ఘాడ‌మైన క‌థాంశాన్ని తెర‌పై చూపుతామ‌ని ఫీలింగ్ ని కలిగించారు. ఈ పోస్ట‌ర్ లో ఉన్న ఒక విష‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. శ్రీరాముడు విల్లంబులతో ఆకాశంలో ఒక రాక్షసుడిని లక్ష్యంగా చేసుకుని బాణం సంధిస్తున్నారు. పోస్ట‌ర్ లో షాడో తోలుబొమ్మలాట క‌నిపిస్తోంది. ఇక కింద దట్టమైన అడవి, యాంటెన్నా టవర్ , కందిరీగ ను కూడా పోస్ట‌ర్ లో చూడవచ్చు. ఇక మేకర్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ నుండి ఈ ఎలక్ట్రిఫైయింగ్ హారర్ మిస్టరీతో మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తున్నామ‌ని చెప్పడం జరిగింది.

- Advertisement -

టెక్నిషియన్స్ కూడా ఫిక్స్..

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోయే ఈ 11వ (BSS11 ) సినిమా మోడ్ర‌న్ డే స్టోరీతో లైట్ వర్సెస్ డార్క్ కథను తెలియచేస్తున్నామని మేకర్స్ తెలియచేయగా, భయాన్ని ప్రేరేపించడం ద్వారా ఆశను కలిగించే థీమ్ ని ఎలివేట్ చేయ‌నున్నారు. ఒరిజిన‌ల్ క‌థ‌తో సాంకేతికంగా అద్భుతమైన విజువ‌ల్ ఫీస్ట్ గా ఉండే సినిమాని అందిస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. అత్యుత్త‌మ‌ టెక్నీషియన్స్ ఈ సినిమాకి ప‌ని చేస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్ చేయనుండగా, కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిటింగ్ వ‌ర్క్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరి బెల్లంకొండ వారసుడు ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు