Mass MahaRaja: మరో మల్టీ స్టారర్ లో రవితేజ..?

మాస్ మహారాజ రవితేజ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనింగ్ సినిమాలకు పెట్టింది పేరు. కెరీర్ తొలి నాళ్ళల్లో సపోర్టింగ్ రోల్స్, మల్టీ స్టారర్స్ చేసిన రవితేజ హీరోగా క్లిక్ అయ్యాక అడపాదడపా క్యామియోస్ మినహా పూర్తీ స్థాయి మల్టి స్టారర్లు చేయలేదు. అయితే, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో రవితేజ మరో మల్టి స్టారర్ లో నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, శర్వానంద్, రవితేజ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ సినిమా రానుందని, నేషనల్ అవార్డు అందుకున్న కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం అందుతుంది.
జీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవనుందని సమాచారం అందుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఒకే ఒక జీవితం తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ఇటీవల రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న రవితేజ రీసెంట్ గా రావణాసుర సినిమాతో డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. శర్వానంద్, రవితేజ లాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ని సందీప్ రాజ్ లాంటి యాంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సెట్ అవ్వటం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
నిఖిల్ లాంటి టైర్2 హీరోలు కూడా పాన్ ఇండియా హిట్స్ అందుకున్న సమయంలో రవితేజ, శర్వానంద్ లకు ఈ సినిమా కీలకం కానుంది. అంచనాలు పెంచుతున్న ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్టే అని, త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ రానుందని సమాచారం అందుతుంది. ఉహాగానాలతోనే హీట్ పెంచుతున్న ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు