పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ నిన్న రాత్రి సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆది పురుష్ టీజర్ విడుదల అయింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ టీజర్కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, టీజర్ బాలీవుడ్ లో సరికొత్త సృష్టించింది. ఆదిపురుష్ హిందీ టీజర్ అత్యధిక లైక్ లు పొందిన టీజర్గా మారడానికి కేవలం 17 గంటల సమయం పట్టడం విశేషం.
కేజీఎఫ్ -2 టీజర్ 24 గంటల్లో 68.83 మిలియన్ల వ్యూస్ సాధించగా.. ఆదిపురుష్ కేవలం 17 గంటల్లోనే 88 మిలియన్ల వ్యూస్ దాటి పోయింది. అదేవిధంగా 935k లైక్స్ వచ్చాయి. 931 లైక్స్తో విక్రమ్ వేద టీజర్ రెండో స్థానంలో నిలిచింది. 24 గంటలు పూర్తయ్యే సరికి మరిన్ని రికార్డులను ప్రభాస్ తన ఖాతాలో వేసుకోనున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక డ్రామాలో కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్గా, సన్నిసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటేడ్తో కలిసి నిర్మిస్తోంది. జనవరి 12న ప్రపచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న విడుదలయ్యే ఈ సినిమా ఫలితం ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.