టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎప్పుడు బిజీ గా ఉండే పూజా హెగ్డే ప్రస్తుతం ఖాళీ అయిపొయింది. కెరీర్ బిగినింగ్ లో హిట్స్, సూపర్ హిట్స్ చూసిన ఈ బ్యూటీకి ఈ మధ్య అదృష్టం అస్సలు కలిసి రావట్లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి.
ఇటీవలనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసీకి కా భాయ్ కిసీకి జాన్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తమిళ్ లో సూపర్ హిట్టైన వీరం సినిమా రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కించారు. టాలీవుడ్ యాక్టర్స్ వెంకటేష్, జగపతి బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు.
అయితే మొదటి నుంచి టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పూజ, కిసీకి కా భాయ్ కిసీకి జాన్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఆ సినిమా గనక హిట్టయితే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వచ్చు అనుకుంది. కానీ ఆమె లెక్కలు పట్టాలు తప్పాయి. సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో జనాలెవరు థియేటర్ ల వరకు వెళ్ళలేదు. అయితే పూజాహెగ్డే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తప్ప పూజాహెగ్డే చేతిలో వేరే సినిమాలేవీ లేవు. అయితే త్రివిక్రమ్& మహేష్ కి కొన్ని మనస్పర్థల కారణంగా, కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దాంతో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు.
ఇటీవలనే వెకేషన్ కంప్లిట్ చేసుకొని షూటింగ్ కోసం మహేష్ హైదరాబాద్ వచ్చేసాడు, ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుందని అందరు అనుకునేలో పూజాహెగ్డే వెకేషన్ కి వెళ్ళింది. దీన్నిబట్టి చూస్తే మళ్ళీ మహేష్ సినిమాకి కొద్దీ రోజులు బ్రేక్ పడేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతికి విడుదల చేయబోతున్నారు. అలాగే సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News