Pooja Hegde: బ్లాక్‌ సారీలో మెరిసిన పూజా

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులారిటీని సంపాదించుకుంటారు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాణిస్తారు. అయితే అచ్చం అలాగే అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో.. టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బొంబాయి కి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.

ఛాన్స్ వస్తే ఇతర ఇండస్ట్రీలో కూడా రాణించేందుకు సిద్ధమవుతోంది. 2012 సంవత్సరంలో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజ హెగ్డే 2014లో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ముకుందా సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది పూజ హెగ్డే. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అనే పాటలు ఐటమ్ సాంగ్ చేసి అందరిని మెప్పించింది.

అరవింద సమేత, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలతో మంచి గాడిలో పడ్డ పూజా హెగ్డే… ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. గుంటూరు కారం సినిమా లో మొదటగా ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే ఆ తర్వాత… రిజెక్టెడ్ పీస్ ల మిగిలిపోయింది. దీంతో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ… తెలుగులో రీయంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది పూజా హెగ్డే. ఈ తరుణంలోనే తాజాగా బ్లాక్ శారీలో.. కనిపించే అందరిని మెప్పించింది పూజా హెగ్డే. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు