Pooja Hegde: బుట్ట బొమ్మ ఇంకా సింగిల్ గానే ఉందా?

టాలీవుడ్ నటి  పూజా హెగ్డే గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ, కొన్ని రోజుల్లోనే ఇతర ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అక్కడ పెద్దగా హిట్లు రాకపోగా, డిజాస్టర్లుగా పేరు తెచుకోవటంతో ‘ఐరన్ లెగ్’ అనిపించుకుంది. అయితే సినిమాలు ఎలా పోయినా పాటలు మాత్రం సూపర్ హిట్ టాక్ తో సాగేలా చేసుకుంటుంది ఈ భామ. తన సినిమాల్లో ఒక్క పాటు అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే.

అయితే ఈ నటి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్య ఓ దర్శకుడితో ఎదో సంబంధం ఉందని, అందుకే ఆ డైరెక్టర్ తో వరుస సినిమాలు చేస్తుందని వార్తలు వినిపించాయి. కొన్ని రోజులకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం లో ఉందని వార్తకు కూడా వచ్చాయి. ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ సినిమాలో సల్మాన్ సరసన ఈ భామ నటించగా, సల్మాన్ తరువాతి సినిమా ‘భజరంగి భాయ్ జాన్’ సీక్వల్ సినిమా కోసం ఓ అగ్ర నటిని తొలగించి మరీ ఆ స్థానంలో సల్మాన్ పూజని పెట్టటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తాజాగా కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా ప్రమోషన్లలో ఓ దగ్గర సల్మాన్ చేసిన ఓ కామెంట్ వైరల్ అయింది. “నేను అందరికి భాయ్ జాన్ మాత్రమే కాదు ఒకరికి జాన్ ని కూడా అని..” ఆయన జీవితంలో ఓ రాణి ఉందని చెప్పకనే చెప్పాడు. దీనితో ఈ వార్తలు నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ వార్త అటు ఇటు తిరిగి పూజా చెవిలో పడగా… ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

‘నా గురించి ఏమేమి రాస్తున్నారో చూస్తూనే ఉన్నాను. కానీ అవేవి నిజాలు కాదు. నేను సింగిల్. సింగిల్ గా ఉండటం నాకు ఎంతో ఇష్టం మరియు నేను ఇప్పుడు నా కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే పూజా ఇంకా సింగిల్ గానే ఉందా ? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు