Parasuram : సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కు నిరాశ ?

పరశురామ్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తో చిత్రికరించిన ‘గీత గోవిందం’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కాలేకేషన్లు సంపాదించింది. ఈ సినిమా అటు హీరో విజయ్ దేవరకొండ, ఇటు హీరోయిన్ రష్మిక మందన్నా కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా తరువాత పరశురామ్ వరుస హిట్స్ అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ తో ”సర్కారు వారి పాట” సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మహేష్, కీర్తి సురేష్ కంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

అయితే, దర్శకుడిగా వరుస హిట్లు అందుకున్న పరశురామ్ ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేకుండా ఉన్నాడు. గతం లో అక్కినేని యువ హీరో నాగ చైతన్య తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఒక సినిమాను అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమా అప్పుడు.. ఇప్పుడు.. అనుకుంటూనే, దాని ఊసే లేకుండా పోయింది.

- Advertisement -

నిజానికి నాగ చైతన్యతో పరుశురామ్ మూవీ సర్కారు వారి పాట ముందే రావాల్సింది. అప్పుడు నాగ చైతన్యకు ఓ కథను వినిపించాడు. దానికి చైతన్య ఓకే కూడా చెప్పాడు. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ నుంచి పిలుపు రావడంతో నాగ చైతన్య ప్రాజెక్ట్ ను పక్కనపెట్టాడు. సర్కారు వారి పాట పూర్తి చేసిన తర్వాత నాగ చైతన్య హతో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు.

కానీ ఇప్పుడు ఈ సినిమా తెర మీదకు వచ్చే అవకాశాలు అసలు కనిపించట్లేదు. పరశురామ్ ఇప్పుడు సినిమా తీయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న ”కష్టడీ” సినిమాతో బిజీ గా ఉన్నాడు. దీని తర్వాత కూడా నాగ చైతన్య షెడ్యూల్ బిజీగా ఉందని టాక్. దీంతో పరుశురామ్ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు