Devara: ఎన్టీఆర్ ను తిడుతున్న నందమూరి ఫ్యాన్స్..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ని విజయవాడలోని కైకలూరు ప్రాంతంలో నిర్వహించగా.. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు.

తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకల్లో నటసార్వభౌముడిని స్మరించుకోవడంతో పాటు ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన వారు, సినిమా వైద్య రంగాల్లో విశేష సేవ చేస్తున్న వారికి సత్కారాలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాగా.. టాలీవుడ్ నుండి అనేక మంది హీరోలు వచ్చారు.

ఇక మెగా ఫ్యామిలీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరికీ ఆహ్వానం అందినప్పటికీ.. కేవలం రామ్ చరణ్ మాత్రమే వచ్చాడు. ఎప్పటినుండో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ అభిమానుల్లో ఉందని అందరికీ తెలిసిందే. బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత క్లోజ్ గా ఉన్నా అభిమానులు మాత్రం గొడవలు పడుతూనే ఉంటారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం.. రామ్ చరణ్ రావడంతో అందరికీ ఈవెంట్ పై ఆసక్తి ఏర్పడింది.

- Advertisement -

ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉన్నప్పటికీ కూడా హాజరు కాలేకపోయాడు. మరోపక్క రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా ప్రసంగం ఇచ్చి నందమూరి అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తన సొంత తాత ఫంక్షన్ కి రాకపోయినందుకు నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహానుభావుడి పేరు పెట్టుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నువ్వు ఈరోజు ఆ మహానుభావుడి శతజయంతి వేడుకలనే విస్మరిస్తావా..? ఆయన పేరు లేకుంటే ఇండస్ట్రీలో అసలు నీకు విలువ ఉండేదా..? అంటూ మండిపడుతున్నారు నందమూరి అభిమానులు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు