Teja :మహేష్ బాబు నిజం సినిమాకి 20 ఏళ్ళు

అడుగడుగున అన్యాయం, అవినీతి.. న్యాయం కావాలన్న, నిజం గెలవాలన్న జేబులో నుంచి డబ్బులు తీసి గవర్నమెంట్ ఆఫీసర్ టేబుల్ కింద పెట్టాలి. ప్రజాస్వామ్య దేశంలో నిజానికి వెలకట్టే, అవినీతి అధికారుల మీద సంధించిన అస్త్రం మహేష్ బాబు, తేజ ల ” నిజం” సినిమా

నిజం సినిమా వచ్చి నేటితో సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబుని నటుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఒక్కడు లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మహేష్ బాబు నిజం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి నంది అవార్డ్ కూడా వచ్చింది.

ఇప్పుడంటే మహేష్ బాబు స్టార్డం, ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు కానీ ఒకప్పుడు మహేష్ బాబు స్క్రిప్ట్ సెలక్షనే వేరుగా ఉండేది. ప్రతి సినిమాకి వైవిధ్యం కనబరుస్తూ ఉండేవాడు. కేవలం మాస్ సినిమాలకే బ్రహ్మరథం పట్టే ఆ రోజుల్లో.. ఒక్కడు లాంటి కమర్షియల్ హిట్ వచ్చిన కూడా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే మహేష్ ఎక్కువ ఆసక్తి చూపించేవారు. అందుకే మహేష్ బాబు చేసింది తక్కువ సినిమాలైన తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగాడు. తెలుగులో చిరంజీవి తరువాత హైయెస్ట్ అవార్డ్స్ అందుకుంది మహేష్ బాబు ఒక్కడే.

- Advertisement -

ఇక డైరెక్టర్ తేజ గురించి చెప్పాలంటే.. ఆయన ఆలోచన విధానం, సమాజాన్ని ఆయన చూసే కోణం పూర్తిగా వేరుగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన “చిత్రం” సినిమాతో దర్శకుడిగా పరిచయమై కొత్తరకం ఫిలిం మేకింగ్ స్టైల్ తో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ఎలా ఎదురు చూసేవాళ్ళో అప్పట్లో తేజ సినిమా కోసం ప్రేక్షకులు అలా ఎదురు చూసేవాళ్ళు. అయితే ఒక్కడు కంటే ముందే రావాల్సిన నిజం సినిమా ఒక్కడు తరువాత రిలీజై మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ని క్లాస్ హీరోగా కూడా నిలబెట్టింది ఈ నిజం సినిమా. గోపి చంద్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. సీనియర్ హీరోయిన్ రాశి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు