Murali Mohan : అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు మురళీమోహన్..!!

Murali Mohan : టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప సినిమాకు గానూ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. దాదాపుగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఇప్పటివరకు బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించారు అల్లు అర్జున్.. ఎంతో మాకు తెలుగు స్టార్ సెలబ్రిటీల కలను అల్లు అర్జున్ నిజం చేస్తూ తెలుగు సినీ పరిశ్రమను ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లారని చెప్పవచ్చు.. మొదటి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ను ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు.

ఫ్యాన్స్ తో పాటూ ఇండస్ట్రీ కూడా అసంతృప్తి..

ఎన్నో ఏళ్లుగా ఉన్న సినీ ఇండస్ట్రీ కలను ఎవరైన నిజం చేసినప్పుడు.. ఆ సందర్భంలో ఆ వ్యక్తిని కాస్త ప్రత్యేకంగా సత్కరించడం అలాగే గౌరవించడం వంటివి చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి ప్రత్యేకత అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఎందుకు జరగడం లేదని.. ఈ విషయం పైన అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటూ ఇండస్ట్రీలో ఉండే సన్నిహిత వర్గాల నుంచి కూడా అసంతృప్తి వినిపిస్తోంది.. అయితే తాజాగా ఈ విషయం పైన సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా పలు విషయాలను వెల్లడించారు..

మురళీ మోహన్ కామెంట్స్..

నిన్నటి రోజున సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇందులో చిరంజీవి ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు.. వీరితోపాటు అల్లు అరవింద్ అలాగే పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా అక్కడకి రావడం జరిగింది. ఈ ఈవెంట్లో మురళీమోహన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు వస్తే సినీ ఇండస్ట్రీ ఎందుకు సన్మానించలేదని ప్రశ్నించారు.. కనీసం ఇప్పుడు చిరంజీవి నైనా సన్మానిస్తున్నారు.. ఇది సంతోషమే మేము చెన్నైలో ఉండేటప్పుడు ఇలాంటివి అసలు ఉండేవి కాదని చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

బన్నీ కి అరుదైన గౌరవం..

సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు సైతం ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగినప్పుడు కచ్చితంగా ప్రశంసించాలి అంటూ మురళీమోహన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం పైన అటు చిత్ర నిర్మాతలు సినీ పెద్దలు కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉన్నది. అల్లు అర్జున్ మాత్రం నేషనల్ అవార్డుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకోవడంతో.. ఇటీవలే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.. ఇది కూడా అల్లు అర్జున్ కి ఒక అరుదైన గౌరవం లాంటిదే.. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు.

అల్లు అర్జున్ సినిమాలు..

ప్రస్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్ లో బిజీగా వున్న బన్నీ.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయినట్టు టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు