Month of madhu : ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయండి- కలర్స్ స్వాతి వార్నింగ్

కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మంత్ ఆఫ్ మధు ఇటీవలనే రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసి పాజిటివ్ వాతావరణం లో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక మంచి సినిమాను ఎప్పుడు ఎంకరైజ్ చేసే తెలుగు ప్రేక్షకులు మంత్ ఆఫ్ మధు సినిమాకు నీరాజనాలు పడుతున్నారు.

అయితే ఒక ప్రముఖ వెబ్ సైట్ మాత్రం స్వాతి గురించి, మంత్ ఆఫ్ మధు సినిమా గురించి తప్పుడు వార్తలు రాస్తూ.. తప్పుడు సమాచారాన్ని ప్రేక్షకుల అందిస్తున్నారనికాసేపటి క్రితం జరిగిన మంత్ ఆఫ్ మధు సక్సెస్ మీట్ లో స్వాతి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఎప్పుడు న్యూస్ దొరక్కపోయిన తనని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు తన పర్సనల్ లైఫ్ గురించి ఆ వెబ్ సైట్ వార్తలు రాస్తున్నట్టు తన బాధను మీడియాకు వివరించింది.

మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక సినిమాను ఎలా తీస్తామో మీరు కూడా అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయండి. మీరు నాకు సస్ఫోర్ట్ చేయకపోయిన పర్వాలేదు కానీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి బాధపెట్టకండి అంటూ చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఆ వెబ్ సైట్ ఇష్టానుసారంగా రాయడం వాళ్ళ తన పర్సనల్ లైఫ్ చాలా వరకు ఎఫెక్ట్ అయిందని ఆమె తెలిపింది.

- Advertisement -

ఇక ఈ ప్రెస్ మీట్ లో మొత్తంలో ఆ సదరు వెబ్ సైట్ కు సంబందించిన విలేకరులు అక్కడే ఉన్న కూడా స్వాతి మాటలకూ రెస్పాండ్ అవకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు