టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 1.8 కోట్లతో ఒక పాట చేశామని, అది అందరికి నచ్చుతుందని మోహన్ బాబు చెప్పాడు. ఆ భారీ సాంగ్ తో సహా సినిమా మొత్తం ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ఇచ్చింది. సన్ ఆఫ్ ఇండియా వల్ల ట్రోలర్స్ కు టార్గెట్ అయింది ఒక మోహన్ బాబు మాత్రమే కాదు.. మంచు ఫ్యామిలీ మొత్తం టార్గెట్ అయింది. భారీ డిజాస్టర్ తర్వాత డైలాగ్ కింగ్ మరోసారి సినిమా చేయడం కష్టమే అనుకున్నారు. కానీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజాగా మోహన్ బాబు తన తర్వాత చిత్రాన్ని ప్రకటించారు. తన తర్వాత చిత్రం పేరు “అగ్ని నక్షత్రం” అని, అందులో తాను ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రొఫెసర్ విశ్వామిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ లో విడుదల చేశారు. మొదటి సారి తన కూతురు మంచు లక్ష్మీ నిర్మాణంలో చేస్తున్నానని వెల్లడించారు. అందుకు కొంచెం భయం భయం గా కూడా ఉంది అని ట్విట్టర్ లో మోహన్ బాబు రాశాడు.
మోహన్ బాబు తన తర్వాతి సినిమాను ప్రకటించగానే ట్రోలర్స్ తమ క్రియేటివిటికి పని చెప్పారు. ట్విట్టర్ లో ”మా భయంతో పోల్చుకుంటే మీదీ ఓ భయమేనా..”, ”భయం భయం అని డిస్టిబ్యూటర్స్ చెప్పాలి”, ”టైటిల్ డబ్బింగ్ సినిమా టైటిల్ లాగా ఉంది”. అంటూ ట్రోలర్స్ అప్పుడే కామెంట్లు స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రోలర్స్ కు లాభం జరుగుతుందో లేదా మంచు ఫ్యామిలీకి లాభం జరుగుతుందో చూడాలి.
నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న
‘అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను.
భయం భయంగా ఉంది. pic.twitter.com/keE6cbJHgh— Mohan Babu M (@themohanbabu) July 31, 2022