Nikhil : ‘జీవితంలో తొలిసారి ఏడ్చాను’

టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఈ యంగ్ హీరోతో సినిమా చేస్తే నిర్మాతలు నష్టాల బారిన ఇప్పటివరకు పడలేదని చెప్పుకోవచ్చు. తాజాగా యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో “కార్తికేయ” కు సీక్వెల్ గా “కార్తికేయ 2” వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తుంది. ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కాలభైరవ సంగీతం సమకూర్చగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రను పోషించారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సినిమాను జూలై 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. కానీ అది కూడా కుదరలేదు. తాజాగా ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

అయితే ప్రమోషన్లలో భాగంగా హీరో నిఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటే, ఆగస్టు 12 కు వాయిదా చేయించారని తెలిపారు. కానీ ఇప్పుడు ఆగస్టు 12 కు థియేటర్లు ఉండవు.. అక్టోబర్ లో రిలీజ్ చేసుకోండి అంటున్నారని అన్నారు. ఇంతవరకు ఎప్పుడు కన్నీరు పెట్టుకోలేదని.. దీనివల్ల తొలిసారి ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్. తనలా బ్యాగ్రౌండ్ లేని వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు. దీంతో నిఖిల్ అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒక బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకి ఇండస్ట్రీలో ఇంతలా ఇబ్బందులు పెడతారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు