Manushi Chhillar : జక్కనతో ఛాన్స్ కావాలి

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటుంది. 2017 లో మిస్ వరల్డ్ గా నెగ్గిన తర్వాత బాలీవుడ్ లో ఈ భామకు అవకాశాలు వస్తున్నాయి. ఈమె హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్. అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ లో చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడింది. కానీ మానుషి చిల్లర్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. అంతే కాదు అవకాశాలు కూడా వచ్చాయి.

దీని తర్వాత ప్రముఖ బాలవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసింది. అలాగే విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే కామెడీ డ్రామా చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం మానుషి.. జాన్ అబ్రహంతో కలిసి టెహ్రాన్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇది ఇలా ఉండగా ఓ సందర్భంలో తన ఇష్టమైన దర్శకుడు గురించి తన మనసులో మాట బయటకు చెప్పింది.

“స్టార్ డైరెక్టర్ల తో కలిసి పని చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా విషయానికి వస్తే.. ఖాళీ సమయాల్లో సినిమాలు చూస్తున్న క్రమంలో ఏదైనా నాకు నచ్చితే.. వెంటనే ఆ దర్శకుడితో ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటాను. అలాగే ఆ డైరెక్టర్ నా.. ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడు. నాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే చాలా ఇష్టం. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా నాకు చాలా నచ్చింది. జక్కన్న సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఆయన దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది” అంటూ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రంపశలు కురిపించింది.

- Advertisement -

కాగా జక్కన్న ను మానుషి చిల్లర్ పొగడ్తలతో ముంచడం ఇదే తొలిసారి కాదు. సమయం, సందర్భం వచ్చిన ప్రతి సారి.. రాజమౌళిపై తన ఇష్టాన్ని చూపిస్తోంది. మరి ఇంత అభిమానిగా ఉన్న మాజీ విశ్వ సుందరి మానుషి చిల్లర్ కు రాజమౌళి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు