Manisha Koirala: వారితో ఎఫైర్.. నా మొగుడే శత్రువు.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

అప్పట్లో తన అందంతో, నటనతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ప్రముఖ హీరోయిన్ మనిషా కొయిరాలా.. ఏకంగా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకుంది.. సినిమాలలోనే కాకుండా బుల్లితెర పైన కూడా సత్తా చాటింది మనీషా కొయిరాల.. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా చాలామందితో ప్రేమాయణం సాగించినట్లుగా కూడా అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. అంతేకాదు చాలామంది సెలబ్రిటీలతో ఎఫైర్ ఉన్నట్లుగా కూడా రూమర్స్ వినిపించాయి.

మనీషా వైవాహిక జీవితం, విడాకులు..
అలా స్టార్ హీరోలతో ప్రేమాయణం కొనసాగించిన మనీషా.. పెళ్లి వరకు వెళ్ళలేకపోయింది.. చివరిగా ఈమె 2010 జూన్ 19న నేపాల్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సామ్రాట్ దాహాల్ తో ఈమె వివాహం చాలా గ్రాండ్గా జరిగింది..కానీ వివాహమైన కేవలం 6 నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అటు సామ్రాట్ దాహల్ ఇటు మనీషా కొయిరాల విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.. అలా వివాహమైన రెండు నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది.

నా భర్తే శత్రువు..
విడాకుల అనంతరం ఒక ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను గురించి వివరించింది.. నా జీవితంలో ఒక వ్యక్తి పైన నాకు ప్రేమ ఎప్పుడూ లేదు. అందుకే నా వివాహం కూడా విఫలమయింది.. నా భర్తే నాకు శత్రువు గా మారారు అంటూ కూడా వెల్లడించింది.. ఇలా వివాహమైన ఆరు నెలలకే తన భర్త శత్రువు అవ్వడం..స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది అంటూ వెల్లడించింది. సీనియర్ నటుడు నానా పటేకర్ తో కూడా మనీషా కొయిరాలకు ఎఫైర్ ఉందనే రూమర్స్ గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే అప్పటికే నానా పటేకర్ కు కూడా వివాహమైన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇంతమందితో మనీషా ఎఫైర్..
వీరితోపాటు వివేక్ ముశ్రన్, సిసిల్ ఆంథోనీ, క్రిస్టోఫర్ డోరిస్, ప్రశాంత్ చౌదరి, ఆర్యన్ వెద్ తదితర హీరోలతో ఈమె ప్రేమాయణం నడిపిందని బాలీవుడ్లో కథలుగా వినిపించేవి. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో కాస్త యాక్టివ్గా కనిపిస్తోంది మనీషా కొయిరాలా. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించి పలు రకాల వీడియోలను ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది.

మనీషా కొయిరాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..
మనీషా కొయిరాలా ఒక నేపాలి నటి.. భారతీయ భాషల సినిమాలలో నటించిన ఈమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది .ఇక ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాల.. ఈమె తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా.. ఈయన నేపాల్ 22వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మనీషా కొయిరాలా తన నటనతో ప్రేక్షకుల మన్ననలను పొందడమే కాదు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.. అలా 2001లో నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని సొంతం చేసుకుంది.. అంతేకాదు సినిమాల ద్వారా నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు ఇతర పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు