Brahmanandam: తండ్రి కొడుకులు తాత మనవడు అయ్యారు

Brahmanandam: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతలలో రాహుల్ యాదవ్ నక్క ఒకరు. తీసినవి మూడే సినిమాలు అయినా కూడా అన్ని సినిమాలు కూడా దేనికి అవి ప్రత్యేకమైన చెప్పొచ్చు. మామూలుగా నిర్మాత ఒక ఆలోచనని నమ్మి డబ్బులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఆ ఆలోచన వర్కౌట్ అయి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం అనేది అల్టిమేట్ గా ఒక నిర్మాత కోరుకుంటాడు. రాహుల్ యాదవ్ నిర్మించిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. అయితే గతంలో రాహుల్ మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐదుగురు దర్శకులను తాను పరిచయం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

రాహుల్ నిర్మించిన మొదటి సినిమా మళ్లీ రావా. ఈ సినిమా తో గౌతం దర్శకుడు గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆల్మోస్ట్ సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి విమర్శకులు ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాతోనే గౌతమ్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో స్వరూప్ అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలు తర్వాత రాహుల్ నిర్మించిన మసూద సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరో దర్శకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడు రాహుల్.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. రియల్ లైఫ్ లో తండ్రీ కొడుకులు రీల్ లైఫ్ లో తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకి RVS నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. సావిత్రి మరియు శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.అలానే ఈ బ్యానర్5వ ప్రొడక్షన్‌గా VIBE చిత్రాన్ని కూడా ప్రకటించింది. ఈ బ్యానర్ లో వస్తున్న 4వ సినిమా బ్రహ్మానందం. ప్రీ-లుక్ పోస్టర్ తో పాటు ఒక వీడియోను రిలీజ్ చేసి ఈ సినిమాను అనౌన్స్ చేసారు.

- Advertisement -

గౌతమ్ నెక్స్ట్ సినిమా గురించి బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను వీడియో చూపించారు. వెన్నెల కిషోర్ బ్రహ్మానందంకి గౌతమ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పడం. మరియు తాత పాత్రలో నటించడానికి అతనిని మీరు ఒప్పుకోండి అంటూ ఇద్దరు హాస్యనటుడిని అడగడం. వీడియో లో చూపించినట్లుగా బ్రహ్మానందం సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుంది.

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా టెక్నీషియన్స్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ శాండిల్య పిసపాటి చేస్తుండగా, సినిమాటోగ్రఫీని మితేష్ పర్వతనేని అందిస్తున్నారు. ప్రసన్న ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న బ్రహ్మానందం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు