Malvika Nair : టాలీవుడ్ కలిసి రావట్లేదు..

నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినా, విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు అందుకుంది. ఈ సినిమాకి గాను నాగ్ అశ్విన్ కి నంది అవార్డ్ కూడా వచ్చింది.

సాధారణంగా కేరళ అమ్మాయిలకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్, నివేత థామస్, నిత్య మీనన్ రీసెంట్ గా చూసుకుంటే సంయుక్త మీనన్. ఇలా చాలా మంది కేరళ అమ్మాయిలు టాలీవుడ్ లో మొదటి సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే మిగితా కేరళ హీరోయిన్స్ తో పోల్చుకుంటే మాళవిక నాయర్ కి మాత్రం అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. దాదాపు ఆమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడటం వల్ల ఈ కేరళ కుట్టికి తెలుగులో ఆశించినంత గుర్తింపు రావట్లేదు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మినహా, మాళవికకి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా రాలేదు. చేసింది మంచి సినిమాలు, మంచి పాత్రలే అయిన ఆమె సినిమాలేవీ హిట్ మొహం చూడలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమాతోనైనా ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో అనుకుంటే ఎప్పటిలాగానే ఈ సినిమా కూడా పేరు తెచ్చింది తప్ప కమర్షియల్ గా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం మాళవిక చేతిలో సినిమాలేవి లేకపోవటంతో ఈమె కెరీర్ ని అయోమయంలో పడిపోయింది. అందం, నటన అన్నీ ఉన్న అదృష్టం మాత్రం ఈ అమ్మడిని వరించట్లేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే మాళవిక మరో సినిమా చేయబోతుంది అని వార్తలు వస్తున్న, వాటిపై ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడే ఈమె కెరీర్
ఇలా ఉంటే ముందు, ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు