Apsara Rani : ఆర్జివి ఫేవరెట్ హీరోయిన్ కొత్త సినిమా

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ అప్సర రాణిల వ్యవహారం గురించి అందరికి తెలిసిందే.థ్రిల్లర్ అనే సినిమాతో మొదలైన అప్సర రాణి, ఆర్జివిల రిలేషన్ షిప్ పబ్స్, పార్టీస్ అంటూ చాలా దూరమే వెళ్ళింది.

ప్రముఖ యాక్టర్ సత్య ప్రకాష్ డైరెక్టర్ గా మారి, తన కొడుకు నటరాజ్ ని హీరోగా పెట్టి ఊల్లాలా ఊల్లాలా అనే సినిమా తీసాడు.2020లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ హాజరవ్వగా, అప్పుడే ఆ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించిన అంకిత మహారణాతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఆమె పేరుని ఆర్జివి అప్సర రాణిగా మార్చి, థ్రిల్లర్ అనే సినిమా తీసాడు. కోవిడ్ వల్ల ఈ సినిమా ఓటిటిలో రిలీజై, నెగిటివ్ రివ్యూస్ అందుకుంది.

రామ్ గోపాల్ వర్మ వల్ల ల్యంలైట్ లోకి వచ్చిన అప్సర రాణి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వడంతో అప్సర రాణి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ఆమె గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన సీటిమార్ సినిమాలో మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించింది.ఇటీవలనే వచ్చిన సుధీర్ బాబు హంట్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది .అయితే ఈ సినిమా ఆశించనంత విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతం ఆమె ఐటెం సాంగ్స్ కి బ్రేక్ వేసి సినిమాలపై దృష్టి పెట్టింది. తెలుగు సీరియల్ నటుడు మానస్ హీరోగా, అప్సర రాణి హీరోయిన్ గా ప్యారా ఖుల్హద్ అనే సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి వస్తుండటంతో ఆర్జివి, అప్సర రాణిని విష్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కి అప్సర రాణి మురిసిపోతూ ఆర్జివికి థాంక్స్ చెప్పింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు