Bollywood: ఫోటో చూసి మురిసిపోతున్న లైగర్ బ్యూటీ

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్ కి చెందిన ఈ సుందరి హిందీలో విలక్షణ నటుడైన “చుంకి పాండే” కూతురు కావడం విశేషం. అందువల్ల బాలీవుడ్ లో స్టార్ ఫ్యామిలీల వారసులను పరిచయం చేసే కరణ్ జోహార్ అనన్య పాండేను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చాడు. అలా 2019లో “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2” సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది.

అయితే ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అయినా స్టార్ హీరో కూతురు కావడంతో వరుస బెట్టి ఆఫర్లు వచ్చాయి. 2022 లో కరణ్ జోహార్ ద్వారానే పూరి జగన్నాథ్ సినిమాలో ఆఫర్ కొట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. ఫలితంగా టాలీవుడ్ అప్ కమింగ్ అవకాశాలను చేజార్చుకుంది.

అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అవుతుంది. కాకపోతే అవన్నీ చిన్న సినిమాలు. ఇటు సినిమాలు చేస్తూనే అనన్య పాండే సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తుంది. తాజాగా ముంబై లోని ఒక హోటల్ పక్కన ఫ్లెక్సీ మీద తన ఫోటోని చూసి మురిసిపోయింది ఈ భామ. అనన్య పాండే అమెజాన్ బ్రాండ్ అంబాసిడర్ లలో ఒకరు అన్న సంగతి తెలిసిందే. అందువల్ల అమెజాన్ సంస్థ వాళ్ళు తమ బ్రాండ్స్ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ పైన అనన్య పాండే ఫోటో ఉంది. ఆ ఫ్లెక్సీ స్టిల్ ని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది అనన్య.

- Advertisement -

ఇక అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుండగా, తాను నటించిన “ఖో గయే హమ్ కహాన్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో అయితే ఈ హీరోయిన్ కి ఇప్పట్లో అవకాశాలు వచ్చేలా లేవు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు