అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా, బాబీ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ మరో క్రేజీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. బాలయ్యకు మిత్రుడైన కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాను స్వయంగా శివరాజ్ కుమార్ నిర్మించనున్నారని అంటున్నారు. అంతే కాకుండా ఈ రెండు భాగాలుగా చిత్రీకరిస్తారని అంటున్నారు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్ తో కలిసి నటించే బాలయ్య, రెండో భాగంలో కమల్ హాసన్ లేదా రజినీకాంత్ ని లైన్లోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారట. మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇంకా అధికారికంగా అనౌన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఈ కాంబినేషన్ గనక కార్యరూపం దాల్చితే, క్రేజీ పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడితో సినిమా తర్వాత బోయపాటితో సినిమా వస్తుందనుకున్న అభిమానులు ఇప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి న్యూస్ వైరల్ అవ్వటంతో ఖుషి అవుతున్నారు. కేవలం నందమూరి అభిమానులకే కాక నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఆసక్తి రేపుతున్న ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News