Kriti Sanan: ఆదిపురుష్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో వస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ జూన్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో నటిస్తుంది హీరోయిన్ కృతి సనన్. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఈమె నటించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ అయిన షెజాద తాజాగా విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఆది పురుష్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

“ప్రపంచవ్యాప్తంగా ఆది పురుష్ జోన్ 16వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించినందుకు నాకు గర్వంగా ఉంది. ఓం రౌత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆది పురుష్ ఆఖరి వర్షన్ చూశాక అందరి అభిప్రాయాలు మారతాయి. దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది. ఈ చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉంది” అని అభిప్రాయపడింది. టి – సిరీస్ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించింది. కొద్దిరోజుల క్రితం అయోధ్యలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు