Krithi Shetty : టాలీవుడ్ కోసం వదులుకున్నా

కృతి శెట్టి.. తొలి సినిమా ఉప్పెనతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. తన నటన, అందంతో అందరిని కట్టిపడేసింది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో సహా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు దక్కించుకుంది. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో కృతి శెట్టి భారీగా ఆఫర్లను వచ్చాయి. వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘ బంగార్రాజు’, ‘ది వారియర్’ చిత్రాలతో నటించి, మెప్పించింది.

వీటితో పాటు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ‘, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లోనూ నటించింది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కృతి శెట్టి ప్రమోషన్స్ పనిలో పడిపోయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ సందర్భంగా కృతి శెట్టి తన బాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని తెలిపింది. అయితే, తనకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏది కావాలో అది ఇచ్చిందని, అందుకే బాలీవుడ్ ఛాన్స్ ను వదులుకున్నట్లు వెల్లడించింది ఈ బ్యూటీ. తనకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక్కడ సినిమాలు చేయడమే తనకు ఆనందాన్ని ఇస్తుందని పేర్కొంది. కాగా, టాలీవుడ్, బాలీవుడ్ పై కృతి శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు