Dil raju: ఆ సినిమాలతోనే తొలిసారి నష్టపోయా

దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర నిర్మాతలలో ప్రముఖ వ్యక్తి. టాలీవుడ్ లో చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు దిల్ రాజు. ఆయన ఖాతాలోనూ పరాజయాలు ఉన్నప్పటికీ.. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుందని చాలామంది అంటారు. నిర్మాతగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తరుణంలో “వారసుడుబలగం “తో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు దిల్ రాజు. ఈ మధ్య ఈయన సోషల్ మీడియాలో తరచూ ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై స్పందిస్తూ.. తాను మంచి చేయాలని చూసినా కూడా నెగిటివ్ కామెంట్లు తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ తన వల్ల ఏదైనా తప్పు జరిగితే మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

ఇక 20 ఏళ్ల తన కెరీర్ లో మూడుసార్లు డౌన్ లోకి వెళ్లి మళ్లీ పుంజుకున్నానని తెలిపారు. రామరామ కృష్ణకృష్ణ సినిమా బాగానే ఆడినప్పటికీ.. ఆ సినిమాకి చేసిన ఖర్చును తిరిగి రాబట్టలేకపోయిందని అన్నారు. తాను మొదటిసారిగా డబ్బు నష్టపోయింది ఈ సినిమాతోనేనని తెలిపారు దిల్ రాజు. ఇక ఆ తర్వాత నాగచైతన్యను జోష్ సినిమాతో పరిచయం చేశానని, ఆ సినిమా కూడా దెబ్బ కొట్టిందని చెప్పారు. ఆ తరువాత బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్లు తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లాయని చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు