టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరన్నా ఉన్నారంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే పేరు ప్రభాస్ అని చెబుతుంటారు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా ఎదిగారు ప్రభాస్. 40 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గా కొనసాగుతున్నారు. ప్రభాస్ పెళ్లి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, అనుష్క రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభాస్, అనుష్క మాత్రం స్పందించలేదు. వీరివురు పెళ్లి గురించి ఎన్నిసార్లు ఖండించినప్పటికీ వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది.
ఒక బిజినెస్ మ్యాన్తో అనుష్క పెళ్లి జరుగుతుందని నెట్టింట ఓ వార్త వైరల్ అయింది. బిజినెస్ మ్యాన్ బెంగళూరుకి చెందిన వారు అని ఒక చెబుతుండగా.. దుబాయికి చెందిన వారని మరొకరు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో హీరోయిన్ అనుష్క వచ్చి చూసి వెళ్లింది. ఈ వీడియోను కొందరూ రహస్యంగా వీడియో తీశారు. దీంతో అనుష్క-ప్రభాస్ సంబంధం మరోసారి బయటపడింది. వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు కృష్ణంరాజు మృతిపై అనుష్క చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అనుష్క షేర్ చేసిన ఫోటోలో కృష్ణంరాజు ప్రేమగా అనుష్కను హత్తుకుని కనిపించాడు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఎంతో మంచి మనసు పెద్ద మనసు ఉన్న కృష్ణంరాజు గారు నిజమైన లెజెండ్ అని, మా గుండెల్లో ఎప్పటికీ మీరు కొలువై ఉంటారని అనుష్క ఎమోషనల్ పోస్ట్ చేసింది. అనుష్క చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022