టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి“. ఈ సినిమాను P. మహేష్ బాబు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించారు. రాధన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఒక ఫ్రెష్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో అనుష్క ప్రొఫెషనల్ చెఫ్ గా నటిస్తుండగా, నవీన్ పోలిశెట్టి ఒక స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుష్ పాట పాడుతున్నాడని కొన్ని రోజులకిందటే మేకర్స్ తెలియచేసారు. ఇప్పుడు తాజాగా ధనుష్ పాడిన పాత విడుదల అయింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాటను ధనుష్ తనదైన స్టైల్ లో పాడాడు. హీరో ఫ్రస్టేషన్ తో బాధపడుతూ ఉంటే ఆ సిట్యుయేషన్ ని ఫన్ గా చూపిస్తూ ఈ పాటను పాడడం జరిగింది. “హతవిధీ” అంటూ మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఫన్నీ గా ఉండి మెప్పిస్తుంది. ధనుష్ ఈ పాటను ఎంతో సింపుల్ గా పాడగా, అంతే సింపుల్ గా క్యాచీ ట్యూన్స్ తో ఉంటుంది ఈ పాట.
అయితే ధనుష్ ఇంతకుముందే తాను నటించిన “సార్” మూవీ లో పాట పాడగా ఆ పాట సినిమాలో పెట్టలేదు. కాబట్టి ఈ పాటే ధనుష్ తెలుగులో పాడిన మొదటి పాట అవుతుంది. అయితే ఇంతకు ముందు కూడా తమిళ స్టార్లు అయిన శింబు, కార్తీలు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను జూన్ చివరి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News