Geethu Rayal : 75 తులాల బంగారం కేసులో గీతూ రాయల్.. దాని వల్లేనా..?

Geethu Rayal : ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్ ( Geethu Rayal ) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది..హౌస్ లో ఉన్నంతసేపు నానా రచ్చ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు బిగ్ బాస్ షో పై రివ్యూలు ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వెళ్ళింది.. ఆపై బిగ్ బాస్ కి వెళ్లడంతో మరింత పాపులారిటీ లభించింది.. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న షోలు చేసిన గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 7 కి బిగ్ బాస్ బజ్ పేరుతో కంటెస్టెంట్లను తన ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టించింది.

చిక్కుల్లో గీతూ..

ఇదిలా ఉండగా తాజాగా గీతూ చేసిన ఒక వీడియోతో సమస్యల్లో ఇరుక్కుందని చెప్పవచ్చు. నటి సౌమ్య శెట్టి మానవ హక్కుల కమిషన్ లో భాగంగా గీతూ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 75 తులాల బంగారం చోరీ కేసులో యాంకర్ ధనుష్ , గీతూ రాయల్ పై పరువు నష్టం దావా కేసు వేసింది.. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నటి సౌమ్య శెట్టి పై కేస్..

గత కొంతకాలం క్రితం నటి సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మౌనిక ఇంట్లో 75 తులాల బంగారం చోరీ చేయగా..ఈమెపై పోలీసులు కేసు పెట్టి జైల్లో పెట్టారు.. అయితే తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చి నటి సౌమ్య శెట్టి, గీతూ రాయల్ తో పాటూ యాంకర్ ధనుష్ లపై కేసు పెట్టింది.. తన గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడారని పూర్తి వివరాలు తెలియక పోయినప్పుడు సైలెంట్ గా ఉండాలని.. నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు అంటూ చెప్పుకొచ్చింది..

- Advertisement -

సౌమ్య శెట్టి పై గీతు వీడియో..

సౌమ్య శెట్టి అరెస్ట్ అయినప్పుడు గీతూ రాయల్, యాంకర్ ధనుష్ లు ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టారు. ఇటీవలే వారిద్దరి కాంబోలో స్టార్ట్ చేసిన ఓ ఛానెల్ లో సౌమ్య శెట్టి గురించి తమకు తెలిసిన విషయాలు చెప్పగా.. ఆమె తాజాగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌనిక , గీతూ స్నేహితురాలు అని.. యాంకర్ ధనుష్ కు సౌమ్య శెట్టి ముఖ పరిచయం ఉందని చెప్పి వాళ్లకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయాలను వివరించారు.. ఇంటికి వెళ్లి బాత్రూం వస్తుందని , మోషన్స్ అయ్యాయని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లి బంగారం చోరీ చేసినట్లుగా వెల్లడించారు.. అయితే గంటసేపు గదిలోనే ఉన్న సౌమ్య శెట్టి డ్రెస్ మార్చుకుని మరీ బంగారం చోరీ చేసిందంటూ వెల్లడించారు.. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది..

వీడియో పై సౌమ్య శెట్టి మండిపాటు..

కానీ తాజాగా నటి సౌమ్య శెట్టి బెయిల్ పైన బయటకు వచ్చి దొంగలు కానని మౌనిక చేయమని చెబితేనే ఇదంతా చేశానంటూ వివరిస్తోంది.. ముఖ్యంగా మౌనికను ఒక అబ్బాయి వేధిస్తున్నాడని.. మౌనిక న్యూడ్ వీడియోలు అతడి దగ్గర పెట్టుకొని.. డబ్బులు కావాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని స్పష్టం చేసింది.. అయితే అప్పటికే పెళ్లయి, భర్త , కూతురు ఉన్న మౌనిక.. ఈ సమస్య నుంచి బయట పడేందుకు తనను సహాయం చేయమని కోరిందని.. ఈ క్రమంలోనే తన ఇంట్లోని బంగారం ఇచ్చి.. అమ్మి పెట్టి డబ్బు ఇస్తే.. తాను ఈ సమస్య నుంచి బయటపడతానని బ్రతిమిలాడినట్లు వివరించింది . అయితే ఇంట్లో ఈ విషయం తెలియగానే మౌనిక తనపై దొంగతనం కేస్ పెట్టి తన తండ్రి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తనను జైల్లో పెట్టించిందని పేర్కొంది.. అలాగే తన గురించి ఏమీ తెలియకుండా గీతూ రాయల్ యాంకర్ గణేష్ చేసిన కామెంట్లపై ఆమె సీరియస్ అయింది.. మొత్తానికైతే తమ నోటి దూలతో కేసులో ఇరుక్కున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు