Anchor Syamala : నా అనుకున్న వారే వెన్నుపోటు పొడిచారు !

గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది శ్యామల. బుల్లితెర పైనే కాక వెండితెరపై కూడా శ్యామల మెరిసింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈమె మొదట్లో సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించినంత స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో బుల్లితెరపై బిజీ యాంకర్ గా రాణిస్తుంది.

ఇదిలా ఉంటే ఈమె సీరియల్ యాక్టర్ నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ, మరోవైపు పలు వ్యాపారాలను కూడా చూసుకుంటున్నారు. అయితే కరోనా సమయంలో శ్యామల భర్త నరసింహారెడ్డి గురించి ఓ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈయన ఒక మహిళ దగ్గర దాదాపు కోటి రూపాయలకు పైగా డబ్బు తీసుకొని.. అప్పు చెల్లించమని అడిగితే తనను బెదిరిస్తున్నాడు అంటూ ఓ మహిళ నరసింహారెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అప్పట్లో ఈ విషయం పెను సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్యూ లో క్లారిటీ ఇచ్చింది శ్యామల. తన భర్త పై కేసు పెట్టిన మహిళ మరెవరో కాదని.. ఆమె తనకు బాగా తెలిసిన వ్యక్తేనని తెలిపింది. ఆ మహిళ తన ఇంట్లో రోజు తను చేసిన వంట తింటూ కలిసిపోయి చాలా మంచిగా ఉండేదని.. తన భర్త పై ఇలా అనవసరంగా చీటింగ్ కేసు ఎందుకు పెట్టిందో తెలియదని వాపోయింది. అయితే ఎట్టకేలకు ఇది అబద్ధం అని రుజువైందని.. తను చేసిన వంట తిని తనకే వెన్నుపోటు పొడిచిందని చెప్పుకొచ్చింది శ్యామల. ఇలా మనవాళ్లు అని చెప్పుకుంటూ, మనతోనే ఉంటూనే వెన్నుపోటు పొడిచే వారు మన పక్కనే ఉంటారని.. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు