Amani : సౌందర్య ప్రెగ్నెంట్ కాదు

సౌత్ ఇండియాలో ఆమె ఓ ప్రత్యేకమైన నటి అని చెప్పాలి. వెండి తెరపై ఆమె చెర‌గ‌ని ముద్ర వేసి చిన్న వ‌య‌సులోనే క‌నుమ‌రుగు అయిపోయిన న‌టి సౌంద‌ర్య‌. ఆమెను అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. జూలై 18, 1972 న బెంగుళూరులో జన్మించిన సౌందర్య తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.

దాదాపు 12 సంవత్సరాల పాటు అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన ఈమె బెంగుళూరులో జరిగిన విమాన ప్రమాదంలో కనుమరుగైపోయింది. ఆ సంఘటన జరిగి 17 ఏళ్లు అవుతున్నా ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఇదిలా ఉంటే తాజాగా.. టాలీవుడ్ లో సౌందర్య కు అత్యంత సన్నిహితురాలు అయిన హీరోయిన్ ఆమని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సౌందర్య గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆమని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సౌందర్య చనిపోయిందని తెలిసి తన గుండె ముక్కలైందని.. ఆమె స్థానంలో తాను చనిపోయిన బాగుండేదని అనుకున్నట్లు ఆమని తెలిపింది.” ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య మాత్రమే. సౌందర్య చనిపోయిందని తెలిసి నా గుండె ముక్కలైంది. ఆమె స్థానంలో నేను చనిపోయిన బాగుండేది. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. లైఫ్ మొత్తం చూశాను. ఇక చనిపోయే సమయానికి సౌందర్యకు పెళ్లయి ఏడాదే అయింది. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు కూడా రాశారు. కానీ అందులో వాస్త‌వం లేదు. స్వయంగా సౌందర్య తల్లి నాకు చెప్పింది”. అంటూ భావోద్వేగానికి గురైంది ఆమని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు