OG Release Date Update : ఓజీ వాయిదా వార్తలపై స్పందించిన టీం… అసలు నిజం ఇదే

OG Release Date Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ఓజి పలు కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓజీ టీమ్ స్పందిస్తూ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంతకీ ఆ రూమర్లకు ఓజి టీం ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అంటే….

పుకార్లకు ఫుల్ స్టాప్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజి. ఈ మూవీలో పవన్ వయోలెంట్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి గ్లిమ్ప్స్ హైప్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా ఓజి మూవీ రిలీజ్ అనుకున్న సమాయానికి అవుతుందా? అనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఇప్పటికే చిత్ర బృందం సెప్టెంబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఫిలిం నగర్ సర్కిల్స్ లో మాత్రం ఓజి సినిమా షూట్ పూర్తి అయినప్పటికీ, ఓటిటీ కారణంగా ఈ ఏడాది వస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి అని ప్రచారం జరుగుతుంది. దీంతో సెప్టెంబర్ లోనే మూవీ రిలీజ్ అవుతుందని భావించిన పవన్ అభిమానులు ఈ వార్తలు చూసి  టెన్షన్ పడడం మొదలుపెట్టారు. తాజాగా ఓజి టీం ఈ విషయం గురించి స్పందిస్తూ మెగా ఫ్యాన్స్ టెన్షన్ కు తెరదించింది.

ఓజీ టీం రిప్లై ఇదే..

ఓజీ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని, పవన్ కళ్యాణ్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందని ఓజీ టీం మూవీ వాయిదా పడుతుంది అన్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కి ఇంకా 151 రోజుల టైం ఉంది. కాబట్టి ఈ ఏడాది అనుకున్న డేట్ కి మూవీ రిలీజ్ అవ్వడం అనేది కేక్ వాక్. కాబట్టి ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ పవన్ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చారు ఓజి టీం. దీంతో ఓజీ మూవీ ఈ ఏడాది వస్తుందా రాదా అన్న అనుమానాలకు తెరపడినట్టు అయింది. ఇక ఎలక్షన్స్ పూర్తవ్వగానే పవన్ ఓజీ సెట్లో జాయిన్ అవుతారు.

- Advertisement -

1950లో బ్యాగ్రౌండ్ ముంబై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఓజి మూవీ రూపొందుతుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నారు. తమన్ ఓజి మూవీకి సంగీతం అందిస్తుండగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు